ప్రముఖ పుణ్యక్షేత్రం, యాదగిరి గుట్ట దేవాలయంలో ఈనెల 18వ తేదీ నుంచి మహా కుంభాభిషేక ఉత్సవాలు జరగనున్నాయి. లక్ష్మీ నర్సింహ స్వామి వారి దివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మించిన విమాన రాజగోపురానికి బంగారు తాపడంతో పాటు.. మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
ఈనెల 18వ తేదీన మొదలయ్యే ఈ ప్రత్యేక ఉత్సవాలు ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. బంగారు శిఖరం ఆకృతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, బంగారు తాపడాలకు కూడా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని మహా గోపురానికి బిగించారు. 18వ తేదీ నుంచి మొదలయ్యే మహా కుంభాభిషేకం ఉత్సవాల్లో శాస్త్రోక్తంగా వీటికి పూజలు నిర్వహించి అమర్చుతారు.వేడుకలకు జిల్లా అధికారులు, దేవదాయ శాఖ తరపున విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.