ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో భీమేశ్వరుడి కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. పంచారామ క్షేత్రంలో ఒకటైన కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో స్వామి వారి కల్యాణోత్సవాలు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. భీమేశ్వరుడికి రుద్రాభిషేకంతో పాటు.. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా వైభవంగా స్వామివారి నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రమణీయంగా అలంకరించిన కళ్యాణమూర్తులకు సుముహూర్తంలో ఆలయ వేద పండితులు, అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా కల్యా ణం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం కుటుంబ సమేతంగా కల్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన కళ్యాణ మండపంలో భీమేశ్వర స్వామి వారికి, మాణిక్యమ్మ అమ్మవారికి వివాహం జరిపించారు. ఈ వేడుకలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.
- Advertisement with us -