24.1 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

24 గంటల్లో ప్రతీకారం తీర్చుకున్న ఇజ్రాయెల్

యెమెన్‌పై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఇజ్రాయెల్‌ ఎయిర్‌పోర్ట్‌పై మిసైల్ దాడులు చేసిన హౌతీ రెబల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 24 గంటల్లోనే ప్రతిదాడులు చేసింది ఇజ్రాయెల్. యెమెన్‌లోని తీర ప్రాంత నగరమైన హొడైడాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్.

ఈ దాడుల్లో హొడైడాలోని పోర్ట్‌ను టార్గెట్‌గా చేసుకుంది. అక్కడ నిల్వ ఉంచిన చమురు ట్యాంక్‌లను పేల్చేసింది. పోర్ట్‌ కార్యకలాపాలు దెబ్బతినేలా చేసింది.

ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే బెన్‌ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై మిసైల్‌ దాడి చేశారు హౌతీలు. ఈ దాడిలో ఎయిర్‌పోర్ట్‌ రోడ్ ధ్వంసమైంది. నలుగురు గాయపడ్డారు. ఈ దాడి కారణంగా కాసేపు ఎయిర్‌ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

దాడి జరిగిన వెంటనే ఇది యెమెన్‌ నుంచి జరిగినట్టు గుర్తించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్. అయితే పలుసార్లు ప్రయత్నించినప్పటికి ఈ మిసైల్‌ను తమ ఎయిర్ డిఫెన్స్‌ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయని ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. దాడి జరిగిన వెంటనే ఇది తమ పనే అని గర్వంగా ప్రకటించుకున్నారు హౌతీలు.

మిసైల్ దాడిపై వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ దాడి చేసిన వారు ఎవరో గుర్తించి.. కౌంటర్ అటాక్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. చెప్పినట్టుగానే 24 గంటల్లో ప్రతిదాడులు చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com