- ఉగ్రదాడికి నిరసనగా భారత్ నిర్ణయం
- 1960 సెప్టెంబర్ 19న ఇండస్ నదీజలాల ఒప్పందం
- రెండు దేశాల మధ్య ప్రవహిస్తున్న ఆరు కీలక నదులు
- తూర్పుకు ప్రవహించే నదులపై హక్కులు భారత్ కు
- పడమట వైపు ప్రవహించే నదులపై హక్కు పాకిస్థాన్ కు
- పడమట నదులపై హైడ్రో ఎల్టక్ట్రిసిటీ ప్రాజెక్టుల నిర్వహణ మనదే
- రెండు దేశాలు పరస్పరం సమాచారం బదిలీ చేసుకోవాలి
- ఏడాదికోసారి రెండు దేశాల్లో సమావేశమవ్వాలి
- పరిస్థితులకనుగుణంగా నదీ జలాల ఒప్పందంలో మార్పులు, చేర్పులు
- పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణే కీలకం
భారత పాకిస్థాన్ దేశాల మధ్య అనేక నదులు ప్రవహిస్తున్నాయి. ఈ జలవనరులన్నీ రెండు దేశాలు సమానంగా పంచుకుని, నదీ జలాల ఒరవడి, ప్రవాహానికి సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పెహల్గాం లో ఉగ్రదాడి కి నిరసనగా ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. ఇండస్ నదీ జలాల సమాచారం బదలాయింపు కూడా ఆపేశారు.
అసలు ఇండస్ వాటర్ ట్రిటీ ఎప్పుడు మొదలైంది? దాని పూర్వ పరాలు..
– 1960 సెప్టెంబర్ 19న భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం మొదలైంది. దాదాపు 9 ఏళ్ల చర్చల తర్వాత ప్రపంచ బ్యాంకు సంతకంతో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందంకుదిరింది.
– రెండు దేశాల మధ్య ప్రవహిస్తున్న అంతర్గత నదీ జలాల వినియోగానికి సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం ఒప్పందం ముఖ్యోద్దేశం
– ఈ ఒప్పందం ప్రకారం మన దేశంలో తూర్పు వైపు ప్రవహించే రావీ, బియాస్,సట్లెజ్ మొదలైన ఆరు నదులు మూడుకోట్ల ఎకరాల అడుగుల మేర ప్రవహిస్తున్నాయి. ఈ జలాలను మన దేశం ఎలాంటి నియంత్రణ లేకుండా నిరంతరాయంగా వాడుకునే సదుపాయం ఉంది.
– పడమట దిశగా ప్రవహించే ఇండస్, చీనాబ్, జీలం నదులు కోటీ 35 లక్షల ఎకరాల అడుగుల మేర పాకిస్థాన్ వైపు ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలలో సింహభాగం పాకిస్థాన్ కు కేటాయించబడ్డాయి.
– ఒప్పందం ప్రకారం పడమట దిక్కున ప్రవహించే నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రత్యేక నిబంధనల ప్రకారం హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పాదన భారత్ కు నిర్వహణ హక్కులున్నాయి.
– పడమట దిక్కున ప్రవహించే నదులపై నిర్మించే ప్రాజెక్టులపై ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని వెల్లడించే హక్కులు పాకిస్థాన్ కు ఉన్నాయి.
– ఈ నదులకు ఇరు వైపులనుంచి ఇద్దరు కమిషనర్లను నియమించారు. వారు ఏడాదికొకసారి మన దేశంలో లేదా పాకిస్థాన్ లో సమావేశమవ్వాలని నిబంధనలున్నాయి. ఇరు దేశాల మధ్య ఢిల్లీలో 2020న సమావేశం జరగాల్సి ఉండగా కోవిడ్ పాండమిక్ కారణంగా రద్దయ్యింది.
– రెండు దేశాలు ఈ ఇండస్ నదీ జలాల ఒప్పందాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని కూడా నిబంధనలు చెబుతున్నాయి.
– ఇండస్ నదీ జలాలను భారత, పాకిస్థాన్ దేశాలు పరిపూర్ణంగా, సమగ్రంగా వినియోగించుకోవాలని అందులో జలాలను పూర్తిగా వాడుకోవాలని అయితే పరస్పర సహకారం, స్నేహ పూర్వక ధోరణిలో మాత్రమే ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాలని ఒప్పందం పీఠికలో ఉంది. రెండుదేశాలు తమ మధ్య అభ్యంతరాలను పరస్పర సహకార ధోరణిలో పరిష్కరించుకోవాలని, పరిస్థితులకనుగుణంగా నిబంధనలను మార్చుకోవడం, అన్వయించు కోవడం లాంటివి చేయాలని అప్పుడే ఈ ఒప్పందం లక్ష్యాలు నెరవేరుతాయని కూడా ఒప్పంద పీఠికలో ఉంది.
– ఈ ఒప్పందాన్ని అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు మార్షల్ మహమ్మద్ ఆయుబ్ ఖాన్ పరస్పరం అంగీకరించి సంతకాలు చేశారు.