కరోనా తర్వాత గుండె పోటు మరణాలు పెరిగిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు బారిన పడుతున్నారు. ఐదేళ్ల పిల్లలు మొదలకుకొని వృద్ధుల వరకు హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గతంలో 40,50 సంవత్సరాల పైబడిన వారికే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొన్ని నెలల క్రితం పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థిని గుండె నొప్పి చనిపోయింది. గత సంవత్సరం హైదరాబాద్ లో ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ మృతి చెందాడు.
గతేడాది ఓ వ్యక్తి పెళ్లికి ముందు నిర్వహించే హాల్ది కార్యక్రమంలో పాల్గొన్నాడు. పెళ్లి కుమారుడికి పసుపు పెడుతూనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండె పోటుకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగింది. స్థానిక టెంపుల్ బస్ స్టాప్ దగ్గర హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఓ యువకుడు దేవుడి దర్శనం కోసం గుడి వచ్చిన కన్నుమూశాడు.