29.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చింది: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ సంచలనం

KCR: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలల పూర్తయిందని.. ఇప్పుడు ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలుసొచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వం.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుందని మండిపడ్డారు.

అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలని అన్నారు. ప్రజలు బాధ్యత ఇస్తే.. అంతే బరువుతో సేవ చేయాలన్నారు కేసీఆర్. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా కేసీఆర్ సమక్షంలో సినీ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మాకు మాటలు రావనుకుంటున్నారా..? ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతాం అని కేసీఆర్ అన్నారు. రౌడీ పంచాయతీలు చేయడం తమకు కూడా తెలుసని చెప్పారు. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యత అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

bhaskaranews
bhaskaranewshttps://bhaskaranews.com
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com