గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం సాధించారు. లండన్ మేడమ్ టుసాడ్స్లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్తో కలిసి ఉన్న మైనపు విగ్రహంతో కొలువుదీరారు. ఈ అరుదైన గౌరవం ఆయనను క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఐకానిక్ మ్యూజియంలో తమ పెంపుడు జంతువుతో నిలిచిన ఏకైక సెలబ్రిటీగా పేరొందారు. లండన్ లో జరిగిన కార్యక్రమానికి రామ్ చరణ్ కుటుంబం, సన్నిహితుల హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రకటనను వాయిదా వేయాలని భావించారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ క్షణాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అని కుటుంబం భావించింది.
రామ్ చరణ్ మైనపు విగ్రహం 2023 ఆస్కార్ వేడుకకు వేసుకున్న నలుపు రంగు వెల్వెట్ బంధ్ గాలా దుస్తులతో తయారు చేశారు — నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ విగ్రహం ఆయన విజయాన్ని మాత్రమే కాదు, ఆయన తన పెంపుడు జంతువుతో ఉన్న బంధాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ వేడుకలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి భావోద్వేగంతో ప్రౌడ్ ఫాదర్ గా మాట్లాడారు. రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ విగ్రహం రామ్ చరణ్ స్టార్ డమ్ కి, లెగసికి, మన జీవితాల్లో పెంపుడు జంతువుల ప్రత్యేకతకు గుర్తుగా నిలుస్తోంది. ఫ్యాన్స్, విజిటర్స్ మే 19 వరకు లండన్లో ఈ విగ్రహాన్ని చూడవచ్చు. తర్వాత విగ్రహాన్ని ప్రదర్శన కోసం మేడమ్ టుసాడ్స్ సింగపూర్కి తరలిస్తారు.