తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 క్యాలెండర్ మరియు డైరీని ఆదివారం ప్రజాభవన్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులకు, సిబ్బందికి అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శివాజీ, ప్రధాన కార్యదర్శి ఏ ఆర్ శెట్టి, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ పున్న నాయక్, ట్రాన్స్కో సెక్రెటరీ బి.రవి, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బి తిరుపతి, సంపత్, మధు, ప్రవీణ్, లక్ష్మయ్య, కె.వి.ఎన్. రెడ్డి, కురుమయ్య, గోపి, చరణ్ సింగ్, జట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం బేగంపేటలోని ప్రజా భవన్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క
ఆదివారం ఉదయం బేగంపేటలోని ప్రజా భవన్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 డైరీని ఆవిష్కరిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క, చిత్రంలో ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు.