దక్షిణ కోరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 181 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న జెజు ఎయిర్ విమానం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 175 మంది మరణించినట్లు తెలిసింది. బోయింగ్ 737-800 విమానం థాయ్ లాండ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురి అయింది. పక్షుల దాడి కారణంగా ల్యాండింగ్ గేర్ వైఫల్యం జరిగిందని ప్రాథమిక సమాచారం.
ఘటనా స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక వాహనాలతో నియంత్రిస్తున్నారు. విమాన వెనుకభాగం టెయిల్ సెక్షన్ నుండి ప్రయాణికులను తరలించడంతో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు.