29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

50 యేళ్ల క్రితం భద్రాచలంలో.. ఇప్పుడు ములుగులో…

తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు అరుదు. బయట ప్రపంచంలో, మనదేశంలోని ఇతర ప్రాంతాల్లో తరచూ భూకంపాలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ, మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి భూకంపాల ప్రభావం చాలా తక్కువ. ఈ ప్రాంతంలో కడసారి 50 యేళ్ల క్రితం భూమి కంపించింది. 1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రత నమోదయ్యింది. భూకంప కేంద్రాన్ని అప్పుడు అధికారులు భద్రాచలం పరిసరాల్లో గుర్తించారు. ఆ తర్వాత ఈ స్థాయిలో మళ్లీ ఇప్పుడు భూమి కంపించిందని శాస్త్రవేత్లలు చెబుతున్నారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థాన చలనం జరిగి ఈ ప్రకంపనలు వస్తుంటాయన్నారు. హైదరాబాద్‌, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయని, అదే ఉత్తర భారత దేశం జోన్ -5లో ఉందని, ఉత్తరాదిలో భూకంపాలు తరచూ వస్తాయని, అక్కడ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com