కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారామ చంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులు.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ ఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన అనంతరం సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఒంటిమిట్టలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతుల పర్యటన దృశ్యాలు భాస్కర న్యూస్ పాఠకుల కోసం….