అమెరికాలో ఫ్లోరిడా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన
వారు మృత్యువతపడ్డారు.
షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) మృత్యువాత పడగా … ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి .. చిన్న కుమారుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం ..
ఈ సంఘటనతో టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..
ఈ ప్రమాదం ఉదయం 3 గంటలకు జరిగినట్లు సమాచారం ..
ప్రమాద సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు . కారు, ట్రాక్కును డికోనగా ఈ దుర్ఘటనలు జరిగినట్లు తెలిసింది.
గత 13 సంవత్సరాలనుండి అమెరికాలో నివాసం ఉంటున్నారని తండ్రి మోహన్ రెడ్డి తెలిపారు.
మృతురాలి కుటుంబ సభ్యులు ఈరోజు బయలుదేరి అమెరికాకు వెళుతున్నట్లు తెలిపారు. మృతదేహాలు అధికంగా గాయాల పాలవడం వల్ల దహన సంస్కారాలు అమెరికాలోనే చేస్తున్నట్లు తెలిపారు.
కాగా మృత్తులు అమెరికాలో సాఫ్టవేర్ ఇంజినియార్సగ స్థిర పడ్డారు