ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గతనెల 22వ తేదీన ఎనిమిది మంది గల్లంతయ్యారు. టన్నెల్లో పైకప్పు కూలడంతో బురద, ఊట నిండిపోవడంతో సహాయక చర్యయలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయితే, ఈ గాలింపుల్లో ఆదివారం టన్నెల్ నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మానవ ప్రయత్నాలతో పాటు.. ఇప్పుడు రోబోలను కూడా సహాయకచర్యల్లో భాగం చేశారు. 18వ రోజు సహాయకచర్యల్లో రోబోలు, వాటి బృందాలు అనుమానిత ప్రాంతంలోకి చేరుకొని తవ్వకాలు చేస్తున్నాయి. మరోవైపు.. లోకో ట్రైన్లో రోబో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లి గాలిస్తున్నాయి. మరోవైపు.. కేరళ నుంచి వచ్చిన కాడవర్ జాగిలాలు కూడా తమవంతు ఆన్వేషణ సాగిస్తున్నాయి. మొత్తం 14 బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి రెస్క్యూ కార్మికులు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టిబిఎం ఆపరేటర్గా పని చేస్తున్న గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించగా.. మిగతా ఏడుగురి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.