మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 1704 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 115, విద్యుత్ శాఖ కు సంబంధించి 92, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 35, ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 05, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 1304 దరఖాస్తులు వచ్చాయి, ఇతర శాఖలకు సంబంధించి 153 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.