వికలాంగుల సాధికారత అవార్డు 2024 కోసం అర్హులైన తెలంగాణలోని వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సంచాలకులు శైలజ ఒక ప్రకటనలో కోరారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చే ఈ అవార్డు కోసం అభ్యర్ధులు www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 29 లోపు సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కన్నారు.