నిందితుల ఆస్తులను ఏకపక్షంగా బుల్డోజర్ తో కూల్చివేయడం వంటి చర్యలు తగవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికారులే న్యాయమూర్తుల్లా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు… అధికారులు కూడా నిందితులపై మితిమీరిన చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు సూచించింది. నిందితుల ఇళ్లను కానీ ఆస్తులను కానీ కూల్చే అధికారం ప్రభుత్వాలకి లేదని సుప్రీం స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని సుప్రీంకోర్టు తెలియచేసింది.