ఛత్తీస్గఢ్లో మరోసారి ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. సుక్మా జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలింది. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ ధృవీకరించారు. సుక్మా జిల్లా చింతలనార్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాయిగూడలో బెటాలియన్ నంబర్ 24 డీఆర్జీ బేస్ క్యాంప్నకు చెందిన జవాన్లు ఏరియా డామినేషన్ కోసం ఉదయం కూంబింగ్ కోసం కు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు కూంబింగ్కు వచ్చే మార్గంలో ప్రెషర్ బాంబును అమర్చారు. 11 గంటల ప్రాంతంలో పొడియం వినోద్ అనే జవాన్ ప్రెషర్ బాంబును తొక్కగా, అది పేలడంతో అతని పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన జవాన్లు ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వినోద్ను ను రాయిగూడ బేస్ క్యాంప్ కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా, మావోయిస్టుల కోసం జవాన్లు రాయిగూడ అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు.