రెండు సంవత్సరాల్లో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనసభలో స్పష్టం చేసారు. పెండింగ్ లో ఉన్న విద్యా సంస్థల పురోగతిపై శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ట్రైబల్ వర్సిటీ స్థలం మర్చి గత ఐదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేసారని లోకేష్ తెలిపారు. 2019లో ఎక్కడైతే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించమో అక్కడే రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేసారు. నిర్మాణ దశలో ఉన్న విద్యా సంస్థలన్నిటికీ పెండింగ్ లో ఉన్న రహదార్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
- Advertisement with us -