శాసనసభలో తన తల్లిని అవమానించినట్లు లోకేష్ నిరూపిస్తే తాను బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైఎస్సీర్సీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారాలోకేష్ నిన్న శాసనసమండలిలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందిచారు. అసలు అనుచిత వ్యాఖ్యలపై కేసులే పెట్టదలచుకుంటే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని అంబటి రాంబాబు ఎక్స్ లో వ్యాఖ్యానించారు.
- Advertisement with us -