దక్షిణ కొరియా దేశ పర్యటనలో భాగంగా ఈరోజు(శుక్రవారం) భారత దేశ రాయబారి అమిత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.
ఈసందర్భంగా రాయబారి అమిత్ కుమార్ తెలంగాణ శాసన బృందంతో మాట్లాడుతూ తాను రెండు సార్లు హైదరాబాద్ సందర్శించానని హైదరాబాద్ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అన్నారు. భారతదేశంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని కితాబిచ్చారు.
దక్షిణ కొరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అవకాశాలు బాగున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి మంచి వాతావరణం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ శాసన బృందం ఈ సందర్భంగా కోరింది
ఆస్ట్రేలియా లోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం కామన్వెల్త్ దేశాల స్టడీ టూర్ లలో భాగంగా న్యూజిలాండ్, జపాన్ దేశాలలో పర్యటించి దక్షిణ కొరియా చేరుకున్న తెలంగాణ శాసన బృందం.