వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జౌళిశాఖపై సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వశాఖలు, కార్పోరేషన్ల నుండి వారికి అవసరమైన వస్త్రాల కోసం వెంటనే ఆర్డర్లు తెప్పించుకోవాలని టెస్కో నుండి సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలని టెస్కో ఎండి శైలజా రామయ్యర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సప్లై త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం సంఘాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, సంఘాల నుండి కొనుగోలు చేసి సంబంధిత శాఖలకు సప్లై చేశామన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా జీవో 18 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకి యార్న్ డిపో మంజూరి చేసిన విషయాన్ని మంత్రి మరోసారి గుర్తుచేశారు. ఈ యార్న్ డిపోకి 50 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు.