బంగ్లాదేశ్లో అరాచకాలకు అడ్డుకట్ట పడలేదు. ఇప్పటికే దేశద్రోహం ఆరోపణలపై చిన్మోయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు ఆయన లాయర్ మోహన్రాయ్పై కొందరు దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన మోహన్రాయ్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొదుతున్నారు. చిన్మోయ్ దాస్ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. ఆయన లాయర్పై దాడి చేయడం అనుమానాలకు తావిస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు, మైనారిటీలు చిన్మోయ్ ఎప్పుడు విడుదలవుతారా? అని ఎదురుచూస్తున్నారు. కానీ, కోర్టుకు రాకముందే లాయర్పై దాడి జరిగింది. అంతేకాదు.. లాయర్ ఇంటిని కూడా ధ్వంసం చేసినట్లుచెబుతున్నారు.