పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం కోర్టులకు సెలవు కావడంతో నరేంద్ర తరపు న్యాయవాది హౌజ్ మోషన్ మూవ్ చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేంద్రరెడ్డిని నేరస్తులతో కలిపి ఉంచారు. నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీనే కాకుండా మాజీ శాసనసభ్యుడు కూడా అయినందున అతన్ని స్పెషల్ బ్యారక్ లో ఉంచాలి పిటీషన్ లో కోరారు. అయితే కోర్టు నరేందర్ రెడ్డి తరపున దాఖలైన హౌజ్ మెషన్ పిటీషన్ను తిరస్కరించింది.