ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ వెళ్ళనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళతారు. శనివారం ఢిల్లీలో జరిగే హిందుస్ధాన్ టైమ్స్ కాంక్లేవ్ లో సీయం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే రేపు కేంద్ర ఆర్థికశాఖ మంత్తి నిర్మల సీతారామన్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులని కలసి రాష్ట్ర వ్యవహారాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి ముంబయ్ వెళతారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
- Advertisement with us -