ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రఘురామ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైనట్లు సభలో ప్రకటించారు. 2019లో వైఎస్సార్సీపీ తరపున నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన రఘరామరాజు ఆ తరువాత పార్టీకి దూరమై చంద్రబాబుకు దగ్గరయ్యారు. తాజాగా ఈ సంవత్సరం మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. తొలుత శాసనసభాపతి స్ధానం ఆశించినప్పటికీ ఆ స్ధానానికి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని ఎంపిక చేశారు చంద్రబాబు. దీంతో రఘురామ కృష్ణంరాజు ఉపసభాపతి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
- Advertisement with us -