37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలి :చంద్రబాబు

శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులుగా హుందాగా ఉండాలని, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు..కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై అధ్యయనం చేయడం వల్ల అవగాహన కలుగుతుందన్నారు. పని చేయాలనే ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. ప్రజలకు ఎమ్మెల్యేలు జవాబుదారీగా పనిచేయాలన్నారు.ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని వాటిని తీర్చాలన్నారు. నిరంతరం ప్రజలు మనల్ని గమనిస్తూనే ఉంటారన్న విషయం మర్చిపోవద్దని, బూతులు మాట్లాడితే ప్రజలు అంగీకరించబోరన్నారు. బడ్జెట్‌ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వం తెచ్చే పాలసీలు, బిల్లులపై అధ్యయనం చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com