నల్లమల బిడ్డగా మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాం. మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ ప్రకటించారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో వారి అభివృద్ధి, సాధికారత కోసం పనులు చేపడతామని తెలిపారు.
నల్లమల డిక్లరేషన్ ఆంశాలు.
1. తెలంగాణ ప్రభుత్వం 2006 ఆర్వోఎఫ్ ఆర్ చట్టం ప్రకారం 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 2 లక్షల 30 వేల 7 వందల 35 షెడ్యూల్డ్ తెగలకు (ST) అటవీ హక్కులను గుర్తించి, హక్కులు కల్పించింది.
2. ఆర్వోఎఫ్ ఆర్ రైతులు తమ భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, సీఎం రేవంత్ రెడ్డి జనవరి 10న జరిగిన సమావేశంలో RoFR భూములు కలిగి ఉన్న ST రైతులకు సోలార్ పంపుసెట్ల ఆధారిత నీటిపారుదలని అందించడంపై చర్యలకు ఆదేశించారు. ప్రత్యేక పథకం కింద 100% గ్రాంట్తో బిందు సేద్యం & ఉద్యానవన తోటల పెంపకం.
3. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గిరిజన కుటుంబాల జీవనోపాధి, ఆదాయాన్ని పెంపొందించడానికి “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని రూపొందించింది.
4. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ ఆర్ భూములకు నీటిపారుదల సౌకర్యాల కోసం బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
5. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్వోఎఫ్ ఆర్ భూముల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా “ఇందిర సౌర గిరి జల వికాసం” అనే పథకానికి శ్రీకారం చుట్టింది.
6. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మే 19న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారంలో ప్రారంభించారు, ఇది 27 ST ఆర్వోఎఫ్ ఆర్ రైతులకు చెందిన 44.5 ఎకరాల ఆర్వోఎఫ్ ఆర్ భూమికి సంబంధించింది.
7. ఈ పథకంలో సమగ్ర భూ అభివృద్ధి, ఆఫ్-గ్రిడ్ సోలార్ పంప్ ఇరిగేషన్ వ్యవస్థల సంస్థాపన చర్యలు. బిందు సేద్యంతో ఉద్యానవన తోటల పెంపకం.
8. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం 2025-26 నుండి 2029-30 వరకు 5 ఏళ్ల పాటు అమలవుతోంది. అటవీ, ఇంధనం, ప్రజారోగ్యం, ప్రజారోగ్యం & అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాలు, ఉద్యానవన శాఖల రంగాలలో వారికి చేయూత అందించనున్నారు.
9. రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన గిరిజన సమూహాల కుటుంబాలకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల మంజూరు.
10. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం రూ.1000 కోట్ల సబ్సిడీతో 1 లక్ష మంది ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని నల్లమల డిక్లరేషన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది.