దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించిన కాన్పూర్ లోని గంగా వంతెనలో కొంత భాగం మంగళవారం కూటిపోయింది. బ్రిటీష్ పాలకుల హయాంలో 1875లో ఈ గంగా వంతెనను నిర్మించారు. అప్పట్లో ఈవంతెన నిర్మాణానికి ఏడు సంవత్సరాల నాలుగు నెలలు పట్టింది. కాన్పూర్, లక్నోలను కలుపుతూ ఉండే ఈవంతెన శిధిలమవడంతో నాలుగేళ్ళ క్రితం దీనిని మూసివేశారు. అప్పటి నుంచీ ఈ వంతెనను చారిత్రక వారసత్వంగా గుర్తించి సుందరీకరణ చేశారు. కాగా మంగళవారం దాదాపు ఈ వంతెన మధ్యలో 80 అడుగుల మేర కూలిపోయి గంగా నదిలో మునిగిపోయింది.