33.2 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

మెట్రో విస్తరణకు కేంద్రం మొండిచేయి

హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రోది కీలక పాత్ర. నగరంలో ప్రతి రోజూ దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణాలు సాగిస్తుంటారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు వేగంగా, సుఖవంతంగా చేరుకునేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, జేబీఎస్- ఎంజీబీఎస్, నాగోల్- రాయదుర్గం మూడు కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతోంది. దాదాపు 30కి పైగా ట్రైన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.

నగరం విస్తరణ దృష్ట్యా మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది.మెట్రో సెకండ్ ఫేజ్‌లో భాగంగా.. కొత్తగా ఐదు కారిడార్లకు సిద్ధమయ్యారు. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌కు, ఎల్బీనగర్‌ నుంచి శివరాంపల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి, ఎంజీబీఎస్‌ నుంచి ఓల్డ్ సిటీ మీదుగా చాంద్రాయణగుట్టకు, మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు, మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు డీపీఆర్ సైతం సిద్ధం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సహా, ఇతర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు.

అయితే కేంద్ర బడ్జెట్‌లో మెట్రోకు కేటాయింపులు పూర్తి స్థాయిలో జరగలేదు. దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులకు కేవలం రూ.31వేల కోట్ల కేటాయింపులు మాత్రమే జరిగాయి.హైదరాబాద్‌ మెట్రోకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగినప్పటికీ బడ్జెట్‌లో ఎక్కడా ప్రత్యేక ప్రస్తావన జరగలేదు. రూ.24 వేల కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మించతలపెట్టగా.. బడ్జెట్‌లో నిధులు మాత్రం కేటాయించలేదు. దేశవ్యాప్తంగా రూ.31 వేలు కేటాయిస్తే అందులో హైదరాబాద్ మెట్రోకు ఏ మేరకు నిధులు దక్కుతాయోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తేనే మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవటంతో.. ఇప్పట్లో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం లేకుండా పోయిందని అధికారులు అంటున్నారు.ఇక హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేసేందుకు మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టగా.. ఆ ప్రాజెక్టు నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ వినతులను కూడా కేంద్రం పట్టించుకోలేదు. వేలాది కోట్ల రూపాయల మూసీ ప్రాజెక్టుకు.. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా దక్కలేదు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com