తాను నాలుగు రోజుల వరకూ విచారణకు హాజరు కాలేనని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు పోలీసులుకు సమాచారం పంపారు. వ్యూహం సినిమా రిలీజ్ సందర్భంలో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకుడు ఒకరు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. టీడీపీ నేత ఫిర్యాదు మేరకు మంళవారం విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగానే సినిమా షూటింగుల షెడ్యూల్ ఉన్నందున తాను మంగళవారం విచారణకు హాజరు కాలేనని మద్దిపాడు పోలసులకు వాట్సప్ లో సమాచాం పంపారు ఆర్జీవి.
- Advertisement with us -