28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

రేవంత్‌ పంతానికి పోవొద్దు : డికె అరుణ సలహా

లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పంతానికి పోవద్దని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హితవు పలికారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఈరోజు మీడియా సమావేశం పెట్టిన డీకే అరుణ ప్రజలను మనం గౌరవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఏ స్థాయిలో ఉన్నా  మీ నియోజకవర్గ ప్రజలని గ్రామ ప్రజలని ఇబ్బంది పెట్టద్దని డీకే అరుణ కోరారు. సీఎం రేవంత్ సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. దాడులు ముమ్మాటికీ తప్పేనని కానీ ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని డీకే అరుణ చెప్పారు. ఫార్మా కంపెనీ ఏర్పాటును లగచర్లలోనే కాకుండా పక్కనే మరో 5 గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని ఆమె తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తాను రేపు లగచర్లలో పర్యటిస్తారని ప్రయాణించారు. సమన్వయంతో వ్యవహరించి సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని లగచర్ల ప్రజలకు చెప్తానని డీకే అరుణ చెప్పారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com