28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

యూపీ మెడికల్ కళాశాలలో అగ్ని ప్రమాదం

  • పది మంది చిన్నారుల సజీవదహనం
  • 16 మంది పిల్లలకు గాయాలు
  • అగ్నిప్రమాద సమయంలో అడ్మిట్ అయిఉన్న 54 మంది పిల్లలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ జిల్లాలో ఉన్న మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని పల్లల వార్డులో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగి పది మంది చిన్నారులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం రాత్రి 10.45 గంటల ప్రాంతాల్లో ఎన్ఐసీయూ విభాగంలో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో మొత్తం 54 మంది పిల్లలు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అడ్మిట్ అయి ఉన్నారు. పిల్లలు ఉన్న వార్డుగదుల్లో ఆక్సిజన్ పూర్తిగా వ్యాపించి ఉండటంతో మంటలు భారీగా విస్తరించాయని ఆసుపత్రి వర్గాలు చెపుతున్నాయి. మరణించిన పది మంది పిల్లల్లో రోజుల వయసు ఉన్న నవజాత శిశువులు కూడా ఉన్నారు. ఈ సంఘటనలో మరో 16 మంది పసి పిల్లలు కూడా గాయపడ్డారు. గాయపడ్డ పిల్లలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com