భక్తి టీవీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆధ్యాత్మిక ఉత్సవం కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న రాష్ట్రపతి ఈ నెల 21వ తేది సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. 22వ తేదిన హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో జరిగే లోక్ మంతన్ – 2024 ప్రాంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.