జార్ఖండ్లో భారతీయ జనతాపార్టీకి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఈసీ నోటీసుల్లో పేర్కొంది. ఈ అంశంపై జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సోషల్మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన పోస్ట్లను వెంటనే తొలగించేలా చూడాలని, లేదంటే ఐటీ చట్టం ప్రయోగిస్తామని ఈసీ హెచ్చరించింది. జార్ఖండ్ రాష్ట్ర బిజెపి సోషల్మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసిన ”తప్పుదోవ పట్టించే, హానికరమైన” వీడియోపై కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు ఆదివారం ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో, ఎన్నికల కమిషన్ నోటీసులు జారీచేసింది.