28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

పోసానిపై ఏపీ సీఐడీ కేసు నమోదు

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు కేసు మోదు చేశారు. తెలుగు యువత కార్యకర్త బండారు వంశీకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోసానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత సెంప్టెంబర్ మాసంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో చంద్రబాబుపై పోసాని అసత్య ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీయం చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయని అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2003 చట్టం ప్రకారం పోసానిపై 111, 196, 353, 299, 341, 336 (3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com