పెద్దపల్లి జిల్లా ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ నర్సింగరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ దగ్గర 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏఈ నర్సింగరావు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగ తీవ్ర కలకలం సృష్టస్తోంది.