మాజీ శాసనసభ్యుడు, ఏపీ సీయం నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్ధితి విషమం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో శనివారం ఉదయం ఆయన మృతి చెందారు. తమ్ముడి మృతి వార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. అలాగే విజయవాడలో ఉన్న నారాలోకేష్ సైతం బాబాయ్ ని ఆసుపత్రికి తరలించిన వెంటనే బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరిగనున్నాయి.
- Advertisement with us -