తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 20వ తేదీన వేములవాడలో పర్యటించనున్నారు. వేములవాడలో నిర్వహించే గల్ఫ్ బాధితుల సభలో రేవంత్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను పంపిణీ చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా పంపిణీ చేయనున్నారు.దీనికోసం ప్రభుత్వం రూ.85లక్షలు కేటాయించింది.