నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ పున:ప్రారంభం కానుంది. డిసెంబర్ 9వ తేదీ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అదే రోజు వారం రోజుల పాటు వాయిదా పడ్డాయి. తిరిగి సోమవారం పున:ప్రారంభం కానున్నాయి. సోమవారం జరిగేసభలో ఇటీవలి కాలంలో మృతి చెందిన ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్నారు. అలాగే ఇటీవల మృతి చెందిన శాసనమండలి సభ్యులు ఇంద్రసేనారెడ్డికి మండలిలో సంతాపం తెలపనున్నారు . స్పోర్ట్స్ కి సంబంధించి మరియూ తెలంగాణ వర్శిటీ సవరణకు సంబంధించి రెండు బిల్లులను సోమవారం నాటి సభలో ఆమోదం తెలపనున్నారు. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం ఉంది.