ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించడంతో పాటు, అగ్నిప్రమాదంపై అవగాహన పెంచేందుకు సచివాలయంలోని ఫైర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో తెలంగాణ స్పెషల్ పోలీసుల రక్షణలో ఉన్న సచివాలయం భద్రతను ఇటీవల ఎస్పీఎఫ్కి అప్పగించారు. దీంతో, వాళ్లకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు.
సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి.. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ G.V.ప్రసాద్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు జన్య, యాదయ్య, ప్రాథమిక అగ్నిమాపక అవగాహన కలిగించడంతో పాటు.. ఫైర్ ఎక్స్ టింగ్విషర్లు, ఫిక్స్డ్ ఫైర్ ఇన్స్టాలేషన్లను ఎలా ఉపయోగించాలనే అంశాన్ని వివరించారు. ఫైర్ సేఫ్టీ నివారణతో సహా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలను తరలించే విధానాల గురించి అగ్నిమాపక అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బందికి తెలియజేశారు. బ్రొంటో స్కై లిఫ్ట్ ద్వారా టెర్రేస్ నుండి ఎలా రక్షించాలో, శ్వాస వ్యాయామాలు, కృత్రిమ శ్వాసక్రియతో కూడిన పద్ధతిని ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవదాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.